COMMITTED FOR CLEAN SOCIETY..
ఈ 'లజ్జ' సిరీస్ ఉద్దేశం మంచి జర్నలిజం ను సమాజానికి అందిస్తూ మీడియా లో జరుగుతున్నా విపరీత పోకడలను అందరికీ చెప్పాలని.
ప్రజాస్వామ్యంలో మీడియా ని 'ఫోర్త్ ఎస్టేట్' అని ఎందుకు అంటారు ? అసలు 'ఫోర్త్ ఎస్టేట్' అంటే ఏమిటి ? ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ వింగ్ ని ఫస్ట్ ఎస్టేట్ అని , శాసన వ్యవస్థ ని సెకండ్ ఎస్టేట్ అని , న్యాయ వ్యవస్థని థర్డ్ ఎస్టేట్ అని పిలుస్తారు. మీడియా కి ఫోర్త్ ఎస్టేట్ అని పేరు పెట్టి , అటువంటి ముఖ్యమైన వ్యవస్థల పక్కన కూర్చోపెట్టారు . అంటే మీడియా పాత్ర అంట ముఖ్యమని అందరూ గుర్తించారు. సమాజంలో జరిగే లేదా జరుగుతున్నా యదార్ధాలను ప్రజలకు చెప్పడం , ముఖ్యమైన విషయాలలో సమాజంలో చైతన్యం కలిగించడం , మంచి విషయాలు చెప్పి సమాజం లో ఉన్నత భావాలూ పెంపొందించడం , ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని యధావిధిగా చెప్పడం , ప్రతీ విషయం లో ప్రజల పక్షాన నిలబడటం , ఇలాంటి అనేక ముఖ్య బాధ్యతలు మీడియా భుజాన ఉండటం వాళ్ళ దానిని ఫోర్త్ ఎస్టేట్ అని అంటారు. అంటే ప్రజాస్వామ్య మూలస్థంభాలలో మీడియా ఒకటి. చరిత్రలో ఎన్నోసార్లు మీడియా ప్రజల పక్షాన పోరాడింది. ఎన్నో విషయాల్లో చైతన్యం కలిగించి దేశాన్ని కాపాడింది. మీడియా లేని నాగరిక ప్రపంచాన్ని ఊహించడం కష్టం. మన దేశ స్వతంత్య్ర సాధనలో మీడియా పాత్ర ముఖ్యమైనది.
జర్నలిజం ఒక శాంతియుత ఆయుధం,
జర్నలిజం ఒక భావ స్వాతంత్య్రం,
జర్నలిజం ఒక అందమైన కవిత్వం,
విలువల తో కూడిన జర్నలిజం లేని సమాజం,
దారి తెన్నూ లేని కూపస్థ మండూకం.
అలాంటిది ఈరోజు జర్నలిజం పరిస్థితి ఏంటి ? దానికి ఉన్న విశ్వసనీయత ఎంత ? జర్నలిజం ఒకప్పుడు సమాజం దృష్టిలో ఎంతో గౌరవప్రదమైన వృత్తి. ఒకప్పుడు జర్నలిస్టులు అంటే వారికి ఎంతో గౌరవం దక్కేది. అలాంటిది ఇప్పుడు జర్నలిస్టులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. జర్నలిస్టులను నమ్మలేని వ్యక్తులుగా , అబద్దాలు చెప్పేవారిగా , విశ్వసనీయత లేని వ్యక్తులుగా సమాజం చూస్తోంది. మరి అందరు జర్నలిస్టులు అలాగే ఉన్నారా అంటే కాదు. ఇప్పటికీ వృత్తి పట్ల ఎంతో అంకితభావంతో ఉండే జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు. మరి తప్పు ఎక్కడ జరుగుతోంది ? మనం సోషల్ మీడియా గురించి తరువాత మాట్లాడుకుందాం . మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపుగా కార్పొరేట్ సంస్థల చేతుల్లో చిక్కుబడిపోయింది. మీడియా సంస్థల మానేజ్మెంట్లు మీడియా ను కూడా ఫక్తు వ్యాపారంగా చూడటం, అంతే కాకుండా వాళ్లకున్న ఇతర వ్యాపార , రాజకీయ అవసరాలను తీర్చుకోవటం కోసం మీడియా ను కీలు బొమ్మగా వాడుకోవటం లోనే అసలు సమస్య అంతా దాగి ఉంది.
జర్నలిజం పట్ల నిబద్ధత కలిగిన వాళ్ళు మీడియా నిర్వహణ లో పెరుగుతున్న ఖర్చుల వల్ల, సమాజం లో పెరుగుతున్న కార్పొరేట్ పోకడల వల్ల మీడియా సంస్థలను నడపడం కష్టంగా మారుతోంది. నిబద్దతతో కూడిన జర్నలిజం చేస్తూ ఆస్తులను అమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
కానీ అటువంటి జర్నలిస్టులు ఇప్పుడు లేరు అని కాదు కానీ మెజారిటీ మీడియా సంస్థలు ఇప్పుడు చేసేది జర్నలిజం కాదు , జర్నలిజం పేరుతో వ్యాపారం. ఇది జీతం కోసం ఉద్యోగం చేసుకునే సాధారణ జర్నలిస్ట్ తప్పు కాదు , మీడియా ను కూడా మామూలు వ్యాపారంగానో లేదా అడ్డదార్లు తొక్కి కోట్లు కొల్లగొట్టుకోవాలి అని అనుకునే మీడియా సంస్థలది , వాళ్ళని వాడుకునే రాజకీయ పార్టీలది.
ఇక తెలుగు మీడియా పరిస్థితి మరీ ఘోరం. మెయిన్ స్ట్రీమ్ తెలుగు మీడియా లో మెజారిటీ సంస్థలు చేసే జర్నలిజం , అదేమీ జర్నలిజం అనేది ఎంత బుర్ర బాదుకున్నా అర్ధం కాదు. నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తారు. పూర్తి భావ దారిద్య్రం తో సతమతమౌతుంటారు. పూర్తి పక్షపాతం తో ఎటో ఒక వైపు , ఎదో ఒక రాజకీయ పార్టీవైపు ఒరిగిపోయి ఉంటారు, ధనికులకు ఒక న్యాయం సామాన్యునికి ఒక న్యాయం అనేట్టు వ్యవహరిస్తుంటారు, డబ్బు సంపాదనే ధ్యేయంగా పని చేస్తూ ఉంటారు , తమకు ఇష్టమైన లేదా ఆర్ధిక అవసరాలను తీర్చే రాజకీయ పార్టీ లను , నాయకులను సమాజం మీద రుద్దుతూఉంటారు , తాము చెప్పేదే నిజమని ప్రజలను నమ్మించి మోసం చెయ్యాలని చూస్తుంటారు , తమ తప్పులను ఎత్తి చూపితే సమాజ ద్రోహులుగా ముద్ర వేస్తూ ఉంటారు , ప్రగతికి అడ్డుపడుతూ ఉంటారు , సమాజం లో విధ్వంసం సృష్టించేవాళ్ళు తమవాళ్లు అయితే చూసీచూడనట్టు పోతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా లో మెజారిటీ మీడియా ఎన్నో అవలక్షణాలతో సతమతమౌతోంది, జర్నలిజం లో విలువలను ధ్వంసం చేస్తోంది. అటువంటి వారికి 'Nani's Voice' అడిగే ప్రశ్న ఒక్కటే , " ఇలా చెయ్యటానికి లజ్జ లేదా సోదరా ?"
Copyright © 2023 NANI'S VOICE - All Rights Reserved.
Powered by GoDaddy
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.